Category: Telugu

తెలుగు భాషా ఉనికిని కాపాడుకునేందుకు ఏమి చేయాలి?

మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాము. అంతర్జాల వినియోగం బాగా పెరిగిపోయింది. కృత్రిమ మేధస్సు ద్వారా ఎన్నో కష్ఠతరమైన సమస్యలను సాధించగలుగుతున్నాము. కానీ మన మాతృభాషను ఉపయోగించడంలో చాలా వెనకబడిపోయాము. దీనికి కారణము పర భాషను మనపై రుద్దటమే. “W3Tech” అనే వెబసైట్లో అంతర్జాలంలో ఆంగ్ల భాషా 54% ఉంటే హింది 0.1% మాత్రమే ఉంది. ఇక తెలుగు అయితే కేవలం 0.012% మాత్రమే ఉంది.

ఇలా అయితే రాను రాను మన ముందు తరాల వారు తెలుగు వాడకం తగ్గిస్తారేమో అన్న భావన నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. ప్రస్తుతం తెలుగుకి పెద్దగా ముప్పు లేకపోవచ్చు కానీ మనం మేల్కోనడానికి ఇదే సరైన సమయం. అయితే ఇదంతా ప్రభుత్వం వలనే అని చేప్పి మనం తప్పించుకుంటే చేజేతులా తప్పు చేసిన వాళ్ళవుతాం. అయితే, ఈ వ్యాసంలో మనం అంటే నేను లేదా ఈ వ్యాసం చదివే వారు ఎవరు అయినా కావచ్చు, మనమంతా బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తే తెలుగుని ముందు తరాల వారికి మరింత తీయ్యందనంతో అందించిన వారవుతాం.

అందుకోసం మనం చేయ్యవలసిందేంటంటే ఇంట్లో అందరితో తెలుగులోనే మాట్లడడం. ఇది మొదటిది మరియు అన్నింటికంటే ముఖ్యమైనది. రెండవది మన పిల్లల పై ఆంగ్లం లేదా పర భాషాను రుద్దకపోవడం. తెలుగులో మాట్లాడితే తక్కువగా చూసే చులకన భావనను తీసివేయాలి. మనం ఆలోచిస్తే అది మన మాతృభాషలో చేస్తాం కానీ వేరే భాషా లో కాదు. కంప్యూటర్/చరవాణి ఇతరత్రా పరికరాలు వాడినప్పుడు సాధ్యమైనంత వరకు తెలుగును ఉపయోగించాలి. ముఖ్యంగా మనం ఏదైనా సందేశాన్ని సృష్టించినప్పుడు లేదా స్టేటస్లు పేట్టినప్పుడు తెలుగునే వాడాలి.

ప్రస్తుత జీవన విధానంలో సామాజిక మాధ్యమాలను మనమందరం వాడుతున్న వాళ్ళమే. ఈ మాధ్యమాలలో తెలుగుని ఉపయోగిస్తే ఒక మంచి భవిష్యత్తుకు మనం స్రీకారం చుట్టిన వారవుతాం. ఎందుకంటే వీటి వలన సందేశాలను క్షణాల్లో పంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక సంచలన వార్త త్వరగా అందరికి చేరుతుంది(వైరల్ అవుతుంది). ఇలాంటి వార్తలను అందరు ఆసక్తితో చదువుతారు. వీటిని మనం తెలుగులో పంచుకోవాలి. మనలో చాలా మందికి తెలుగుని వాడాలని ఉన్నా తెలుగు ఎలా టైపు చెయ్యాలో తెలియక ఆంగ్లాన్ని వాడుతారు. ఈ సమస్యను చిన్న యాప్ ద్వారా మనం దూరం చేస్కోవచ్చు. ఇది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలిజేయాలి.

అలా చేస్తే తెలుగు వినియోగం పెరిగి పర భాషా వినియోగం తగ్గుతుంది. తద్వారా అంతర్జాలంలోనే కాకుండా ప్రపంచానికి తెలుగు ఉనికిని చాటొచ్చు. అలాగే రోజు మనం తెలుగు దినపత్రిక, చందమామ కథలు, వంటి ఆసక్తికరమైన పుస్తకాలు పిల్లలకు అలవర్చితే చిన్నప్పట్నుంచే వారిలో తెలుగుపై ఆసక్తిని పెంచిన వారవుతాం.

ఇలా మన జీవితంలో తెలుగుని ఒక ముఖ్యమైన భాగంగా చేసుకుంటే, ఇదే అలవాటుతో మనతో పాటు ఉన్నవాళ్ళను కూడా చైతన్యపరచిన వాళ్ళవుతాం. మనం మారితే ప్రభుత్వాలు దిగి రావా? ఇలా జరిగితే ప్రభుత్వాలు తెలుగునే ఉపయోగిస్తాయి. ఒక్కటి మాత్రం ఇక్కడ మనం మరవకూడదు తెలుగుకి మంచి భవిష్యత్తు కల్పించాలంటే మార్పు అనేది ముందుగా మనతోనే మొదలవ్వాలి, ఎందుకంటే వంద అడుగుల దూరం కూడా ఒక్క అడుగుతోనె మొదలవుతుంది.

ధన్యవాదాలు.

అలా వైకుంటపురం…. అలా బావుంది…

ఈ సంక్రంతికి విడుదల అయిన “అలా వైకుంటపురం” దర్శకుడు త్రివిక్రమ్ గారి మార్క్ కి ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. ఈ సినిమాను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నటనతో మరోసారి రేసుగుర్రం లాంటి ఫ్యామిలి చిత్రాన్ని అందించారు.

మీరు కనుక ఈ చిత్రానికి వెళ్తే మీ టెక్కెటకు పెట్టిన డబ్బులుకు రెండింతలు ఆనందిస్తారు.

ALA VAIKUNTAPURAMLO

Telugu movie ala vaikuntapuramlo

వైజాగ్ వన్డేను 107 పరుగుల తేడాతో గెలిచిన భారత్‌

టాస్ ఓడిపోయిన భారత్ మొదటి 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. రోహిత్ తన 8వ 150+ స్కోరు నమోదు చేయగా, రాహుల్ సెంచరీ చేశాడు.మొదటి వికెట్ కు ఈ ద్వయం 200+ పరుగులని జోడించింది.

శ్రేయాస్ అయ్యర్ వరుసగా నాలుగో అర్ధ సెంచరీ సాధించాడు, వైట్-బాల్ క్రికెట్లో తన ఫామ్ను కొనసాగించాడు. మరో ఎండలో పంత్‌ 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఒక దశలో ఈ జంట రెండు ఓవర్లలో 55 పరుగులు జోడించారు, ఇది భారీ స్కోరును చేయడంలో సహాయపడింది.

తరువాత షమీ, కుల్దీప్ చక్కగా బంతులు సంధించడంతో త్వరితగతిన తమ వికెట్లను వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ సమర్పించుకున్నారు. షమీ వరుసగా రెండు వికెట్లు, కుల్దీప్ తన రెండవ హాట్రిక్ సాధించాడు, అలా చేసిన మొదటి భారతీయుడు.

తరువాతి మ్యాచ్‌లో భార వారి ఫీల్డింగను మెరుగుపరచాలని కృతనిశ్చయంతో ఉంది. వారు ఇప్పటికే చాలా క్యాచ్‌లను వదులుకున్నారు. చాలా క్యాచ్‌లను వదులుకోవడంతో ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్లో ఎటువంటి మెరుగుదల కనిపించలేదు.

ఆంగ్లభాషా మాద్యమం అవసరమా? మొదటి భాగం.

ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో ఐనా తెలుగు మాద్యమంలో చదువుకునే వెసులుబాటు ఉండేది. కాని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ అవకాశం మన పిల్లలకి ఉండదు. ఎందుకంటె అందరు ఆంగ్లంలోనే చదువుకోవాలని జగన్ గారి ప్రభుత్వం చెబుతుంది.

అసలు ఆంగ్ల మాద్యమం ఎందుకు?

ప్రభుత్వం తో పాటు చాలా మందిలో ఉన్న ‍భావన ఏంటంటే ఆంగ్ల మాద్యమంలో చదువుకుంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, బాగా అభివృద్ది చెంద వచ్చు అని అనుకుంటారు. కాని ఇది ఎంత వరకు నిజం? ఒకసారి ఇది ఆలోచించండి! మనం ఇంటర్ వరకు తెలుగులోనే చదువుకున్నప్పటికి పై చదువులు మాత్రం ఆంగ్లంలోనే కదా! మరి ఎందుకు ఏటేటా ఇంతగా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు? పై చదువుల్లో ఆంగ్లం నేరచుకున్నప్పటికి ఎందుకు అభివృద్ది చెందడం లేదు.

మాద్యమం కాదు, వ్యవస్త మారాలి!

అవును నిజం, మారాల్సింది మాద్యమం కాదు వ్యవస్త. ప్రభుత్వాలు ముందు ఉద్యోగ కల్పనపై దృష్ఠి పెట్టాలి. పెద్ద చదువుల్లో బోదనా నాన్నతను పెంచాలి. ఆంగ్ల మాద్యమంలో చదువుకున్న వారిలో నూటికి పది శాతం వారు ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరి మిగితా వారి పరిస్థితి ఏమిటి? ఆ పది శాతంలో కూడా చాలా మంది విదేశాలకు తరలి వెళ్లే వారె కాని భారతదేశానికి చేసేదేమిటి?

గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ

నాని గారి కొత్త చిత్రం ఈ నెల 13 న విడుదల అయ్యింది.ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

చిత్రంలోని మొదటి భాగం కథ గురించి మనకు చెప్తుంది, కాని దానిపై నెమ్మదిగా దశల వారీగా నిర్మితమవుతుంది. మొదటి సగం గ్యాంగ్ సభ్యులు ఎవరు మరియు వారి ఉద్దేశ్యం గురించి వివరిస్తుంది. కామెడీ ఎలిమెంట్ కారణంగా నేను మొదటి సగం ఆహ్లాదంగా సాగుతుంది.

మొదటి భాగంలో చిత్రం ఊపు అందుకుంటుంది, మంచి స్క్రీన్ ప్లేతో పాటు మలుపులను వెల్లడిస్తుంది. సినిమా చివరికి వచ్చేసరికి కాస్త ఎమోషనల్ గా మారుతుంది.

తుది తీర్పు: మొత్తంమీద మనం సినిమాను ఆస్వాదించవచ్చు దీంతో నాని గారి ఖాతాలో మరో హిట్ వచ్చి పడింది.

  • ఈ సమీక్ష పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంది, ఏ వ్యక్తి/సంస్థను విమర్శించటానికి ఉద్దేశించలేదు.

సైరా నరసింహ రెడ్డి విడుదలకు ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు

టాలీవుడ్ అభిమానులుకు, ప్రముఖ నటుడు చిరంజీవి గారు త్వరలో సైరా నరసింహ రెడ్డిగా తన కొత్త సినిమాని విడుదల చేయబోతున్నారు.
ప్రస్తుతానికి ఈ చిత్రం అక్టోబర్ 2 న విడుదల కానుంది. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ఉండబోతోందని, ఈ నెల 18 న హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో జరగనుందని వార్తలు.

గమనిక: వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ 22 వ తేదీకి వాయిదా పడింది.
పుకార్లు ఏమిటంటే, దాని డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్‌కు ఒక అందమైన మొత్తానికి అమ్ముడయ్యాయి, ఇది చిత్రం విడుదలకు ముందే చాలా మంచి వ్యాపారానికి నాంది పలికింది.

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సీరీస్‌కు టీం ఇండియా జట్టు ఇదే

దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టును భారత సెలెక్టర్లు ఎంపిక చేశారు. వెస్టిండీస్ పర్యటనలో రాణించని ఓపెనర్ కెఎల్ రాహుల్ తన స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు, ఇతర బ్యాటర్లు మంచి ప్రదర్శన కనబరిచడంతో సిరీస్ను 2-0తో గెలిచారు.

ఆ స్థానంలో కొత్తగా షుబ్మాన్ గిల్ను ఎంపిక చేసారు. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ లో ఫామ్‌లో ఉన్న పరిమిత ఓవర్ల ఓపెనర్ రోహిత్ శర్మను టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా ప్రయత్నించాలని చాలా మంది సూచిస్తున్నారు. అలాగే, యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, రిషబ్ పంత్ తన చివరి సిరీస్‌లో రాణించలేకపోతినప్పటికి తన స్థానాన్ని కాపాడుకోగలిగాడు.

టీమ్:
విరాట్ కోహ్లీ, షుబ్మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పూజారా, అజింక్య రహానె, హనుమా విహారీ, రిషబ్ పంత్, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.

చంద్రయాన్ -2 భారతదేశపు చంద్రుని విష్లేషణ మిషన్ మరియు దాని కాలక్రమం

చంద్రయాన్ -2 భారతీయ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అభివృద్ధి చేసిన భారతదేశపు రెండవ చంద్రుని విష్లేషణ మిషన్. చంద్రునిలో నీటి లభ్యత సమృద్ధిని గుర్తించడానికి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ల్యాండింగ్ చేయడం దీని లక్ష్యం.
ఇది విజయవంతమైతే యుఎస్ఎస్ఆర్, యుఎస్ఎ మరియు చైనా తరువాత మృదువైన ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారతదేశం అవుతుంది.

కాలక్రమం:

  • 18 సెప్టెంబర్ 2018-ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదం.
  • జూలై 14, 2019 న, GSLV MKIII-M1 / చంద్రయాన్-2 యొక్క ప్రయోగ కౌంట్డౌన్ ఉదయం 06.51 గంటలకు ప్రారంభమైంది.
  • జూలై 22, 2019, ప్రయోగానికి ముందు సాంకేతిక లోపం గమనించిన తర్వాత సవరించిన ప్రయోగ తేదీ.
  • జూలై 24, 2019, మొదటి కక్ష్య పెంచే యుక్తి.
  • జూలై 26, 2019, రెండవ కక్ష్య పెంచే యుక్తి.
  • జూలై 29, 2019, మూడవ కక్ష్య పెంచే యుక్తి.
  • ఆగస్టు 02, 2019 నాల్గవ కక్ష్య పెంచే యుక్తి.
  • ఆగస్టు 06, 2019 ఐదవ కక్ష్య పెంచే యుక్తి.
  • ఆగష్టు 20, 2019, చంద్రుని కక్ష్యలోకి చొప్పించడం.
  • ఆగష్టు 21, 2019, రెండవ చంద్రుని కక్ష్యలోకి చొప్పించడం.
  • ఆగష్టు 28, 2019, మూడవ చంద్రుని కక్ష్యలోకి చొప్పించడం.
  • ఆగస్టు 30, 2019, నాల్గవ చంద్రుని కక్ష్యలోకి చొప్పించడం.
  • సెప్టెంబర్ 01, 2019, ఐదవ చంద్రుని కక్ష్యలోకి చొప్పించడం.
  • సెప్టెంబర్ 02, 2019, విక్రమ్ ల్యాండర్‌ను ఆర్బిటర్ నుండి వేరుచేయడం.
  • సెప్టెంబర్ 07, 2019, విక్రమ్ను ల్యాండ్ చేసే ప్రయత్నంలో విక్రమ్ చంద్రుడి ఉపరితలం నుండి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ లింక్ విచ్ఛిన్నమైంది.
  • సెప్టెంబర్ 09, 2019, ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ యొక్క చిత్రాన్ని పంపింది కాని కమ్యూనికేషన్ లింక్ ఇంకా స్థాపించబడలేదు.

సాహో మూవీ రివ్యూ

ఇది ఒక సాధారణ గ్యాంగ్ స్టర్-కాప్స్ ఆధారిత కథ, ఇది డబ్బు మరియు అధికారం కోసం ప్రజల కోరిక చుట్టూ తిరుగుతుంది.

ఇది ఒక విలక్షణమైన కథ అయినప్పటికీ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం ఈ చిత్రాననికి ప్రత్యేకమైనదిగా చెప్పుకోవాలి. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సన్నివేశాలు మరియు విన్యాసాలతో కూడిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా పరిగణించవచ్చు. అయితే ఈ సినిమాను గ్రాఫిక్స్ నేపథ్యంగా తీసారు.

మొదటి భాగంలో  హీరో సామర్థ్యాన్ని చూపిస్తూ కొంచెం సాగదీతగా అనిపిస్తుంది.

ద్వితీయార్ధంలో యాక్షన్ ప్యాక్ చేసిన దృశ్యాలు మరియు మనస్సును కదిలించే మలుపులతో ఆసక్తికరంగా మారుతుంది.

బలాలు – యాక్షన్ సన్నివేశాలు, విన్యాసాలు, మలుపులు

బలహీనతలు – పోరాటాలు, పాటలు, సాధారణ కథ

రేటింగ్ – 2.5 / 5

* గమనిక: ఈ సమీక్ష పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి వ్రాసినది మరియు ఏ వ్యక్తి /సంస్థను విమర్శించటానికి ఉద్దేశించింది కాదు.